TG : కంటైనర్ లోనే కాలిపోయిన 8 కొత్త కార్లు

TG : కంటైనర్ లోనే కాలిపోయిన 8 కొత్త కార్లు
X

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కార్లు తరలిస్తున్న కంటైనర్ లో మంటలు చెలరేగాయి. దాంతో కంటైనర్‌లో ఉన్న ఎనిమిది కార్లు దగ్ధమయ్యారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పాయి. ముంబై నుంచి హైదరాబాద్‌కు కార్ల లోడ్‌తో కంటైనర్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కంటైనర్ డ్రైవర్ కు గాయాలు కావడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కొత్త కార్లు కళ్లుముందే బుగ్గిపాలు కావడం చూసేవాళ్లను షాక్ కు గురిచేసింది. ఐతే.. కంపెనీ ఇన్సూరెన్స్ ఉంటుందని.. కంపెనీకి నష్టం ఉండదని చెబుతున్నారు.

Tags

Next Story