TG : అన్నా.. బాపు ఎట్లున్నడే! ములాఖత్లో కేటీఆర్తో కవిత

X
By - Manikanta |15 Jun 2024 11:21 AM IST
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తీహార్ జైలులో వున్న ఎమ్మెల్సీ కవితకు ( Kavitha ) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) కలిశారు. శుక్రవారం కవితను మర్యాదపూర్వకంగా కలిసారు. అలాగే కవిత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆమెను కలిసిన అనంతరం కేటీఆర్ హైదరాబాద్ కు తిరుగు పయనం అయ్యారు.
ఇటీవల కవితకు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ ను మరో రెండు వారాల పాటు పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ సీబీఐ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత సీబీఐ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరో సారి పొడిగించింది. సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్ ను రౌస్ అవెన్యూ న్యాయస్థానం అంగీకరించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com