TS : కేసీఆర్ కట్టిన మరో వంతెన ఢమాల్

TS : కేసీఆర్ కట్టిన మరో వంతెన ఢమాల్

పెద్దపల్లి మానేరు వాగుపై వంతెన కూలిపోయింది. ఈ బ్రిడ్జిని పదేళ్లుగా నిర్మిస్తున్నారు. రీసెంట్ గా పనులు ఊపందుకున్నాయి. నిర్మాణంలో ఉన్న ఈ బ్రిడ్జి కూలడం స్థానికులను కూడా ఆశ్చర్యపోయేలా చేసింది. నాసిరకం పనులకు ఇది నిదర్శనమంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ముత్తారం మండం ఓడేడు పరిధిలో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. ఓడేడు నుంచి గర్మిళ్లపల్లి మధ్య దూరాన్ని తగ్గించాలన్న ఉద్దేశ్యంతో వాగుపై నిర్మిస్తున్న ఈ వంతెనను నిర్మిస్తున్నారు. 2016లో ప్రారంభమయిన ఈ పనులు సుదీర్ఘంగా సాగుతున్నాయి.

జనాలు ఎక్కువగా ప్రయాణించని అర్థరాత్రి సమయంలో వంతెన కూలిపోవడంతో ప్రమాదం తప్పిందంటున్నారు. నాసిరకం నిర్మాణంతోనే వంతెన కూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story