TS : తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు

తెలంగాణలో మరో నాలుగు రోజులు అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భువనగిరి, హైదరాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట, హనుమకొండ జిల్లాల్లో వానలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30-40KM వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మరోవైపు మార్చిలో కురిసిన అకాల వర్షాలకు 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా 15,246 మంది రైతులు నష్టపోయినట్లు సమాచారం. వారికి ఎకరాకు రూ.10,000 చొప్పున పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈసీ ఆమోదం తెలపగానే అన్నదాతల అకౌంట్లలో డబ్బులు జమ చేయనుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు అధికారులు పంట నష్టం తుది అంచనాలు సిద్ధం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com