TS : ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి నామినేషన్

వరంగల్, ఖమ్మ,నల్గొండ పట్టభధ్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. నల్లగొండలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు ఈ బిజెపి అభ్యర్థి.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు బిజెపి రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. బేగంపేట్ విమానాశ్రయం నుండి హెలికాప్టర్ లో నల్లగొండ బయలు దేరారు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్.
వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం ఈరోజుతో ముగియనుంది. శుక్రవారం నుంచి నామినేషన్ల పరిశీలన ప్రారంభం కానున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ నెల 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉన్నట్లు వెల్లడించారు.
బుధవారం రోజున మరో 12 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారని.. దీంతో నామినేషన్లు వేసిన వారి సంఖ్య 41కి చేరినట్లు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com