Breaking : బ్రేకింగ్.. హైకోర్టులో రేవంత్ సర్కార్ కు బిగ్ షాక్

Breaking : బ్రేకింగ్..  హైకోర్టులో రేవంత్ సర్కార్ కు బిగ్ షాక్

రేవంత్ సర్కార్ కు (Revanth Government) తెలంగాణ హైకోర్టులో (Telangana Highcourt) బిగ్ షాక్ ఎదురైంది. తెలంగాణ శాసనమండలిలో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, ఆమిర్‌ అలీఖాన్‌లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ గెజిట్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. మళ్లీ గవర్నర్ నూతన నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. మంత్రివర్గం నిర్ణయం తీసుకొని గవర్నర్‌కు తెలపాలని చెప్పింది. దాసోజు శ్రవణ్, కూర సత్యనారాయణ ఎన్నికను గవర్నర్ పున:పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది.

కాగా గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ను ఎన్నుకుంది. కానీ వారికి రాజకీయంగా అనుభందం ఉందంటూ గవర్నర్ ప్రభుత్వ వినతిని తోసిపుచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోదండరామ్, అమిర్ అలీఖాన్‌ను గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా నియమించారు. దీనిపై దాసోజు శ్రావన్, కుర్రా సత్యనారాయణ కోర్టును ఆశ్రయించారు.

Tags

Read MoreRead Less
Next Story