TS : కడియంపై చర్యలకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్

TS : కడియంపై చర్యలకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్

పార్టీని వీడి కాంగ్రెస్‌లో (Congress) చేరుతున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ అధిష్ఠానం సీరియస్‌గా ఉంది. ఈమేరకు ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. పార్టీ ఫిరాయిస్తున్న ఎమ్మెల్యే కడియంపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు పిటిషన్ ఇవ్వాలని నిర్ణయించింది. కానీ ఆయన అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ సెక్రటరీకి ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆయన స్వీకరించేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.

కడియం శ్రీహరి తన కూతురు కావ్యతో పాటు ఈరోజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది.వాళ్లతో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్​లో చేరనున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, పార్టీకి ప్రజలు దూరమవుతున్నారని, కారణాలు ఏవైనా బీఆర్ఎస్ ను ఇంకా ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని కడియం శ్రీహరి చెప్పుకొచ్చారు.

కాగా, ఇప్పటికే ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు, ఒక ఎమ్మెల్యే, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్​కు గుడ్ బై చెప్పారు. ఎంపీలు రంజిత్ రెడ్డి, వెంకటేశ్, పసునూరి దయాకర్ కాంగ్రెస్​లో చేరగా.. బీబీ పాటిల్, పోతుగంటి రాములు బీజేపీలో చేరారు. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌‌‌ కారు దిగి, కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story