TG : కమ్మ సామాజిక వర్గానికి సీఎం రేవంత్ భరోసా

తెలంగాణ రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గం ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న అంశాన్ని పరిశీలిస్తామని రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తన ట్విట్టర్ (ఎక్స్) ట్విట్టర్ ఖాతా వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు.
గురువారం తెలంగాణ కమ్మ సామాజికవర్గ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రే సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. కమ్మ సామాజికవర్గం సమస్యల పరిష్కారం కోసం ఈ సందర్భంగా వారంతా కలిసి గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
వారి విజ్ఞప్తి పట్ల సీఎం స్పందిస్తూ కమ్మ సామాజిక వర్గం సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని హామీ ఇస్తూ ట్విట్టర్ వేదికగా గ్రూప్ ఫోటో పంచుకున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com