TS : సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌ల ఆధునికీకరణకు సీఎం రేవంత్ ఆదేశం

TS : సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌ల ఆధునికీకరణకు సీఎం రేవంత్ ఆదేశం
X

తెలంగాణ లోని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునికీకరించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. కార్పొరేట్ స్థాయిలో భవనాలు, అందులో వెయిటింగ్ హాళ్లు, కెఫెటేరియాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అధిక ఆదాయం లభించే రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని ఆఫీసులకు ప్రాధాన్యమివ్వాలని, సిబ్బంది కొరత ఉండకూడదని తెలిపారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న 104 ఆఫీసుల కోసం స్థల సేకరణ చేపట్టాలన్నారు.

అక్కడికి వచ్చే క్రయ విక్రయదారులు తమ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముగిసే వరకు మంచి ఆతిథ్యమిచ్చేలా సౌకర్యాలు ఉండాలనీ, వెయిటింగ్‌ హాల్‌, డ్రింకింగ్‌ వాటర్‌, కెఫేటెరియా లాంటి అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగే చోట సిబ్బంది కొరత లేకుండా చూడాలనీ, ఆదాయం తక్కువగా ఉన్న జిల్లాల ఆఫీసుల నుంచి ఎక్కువ పని ఉన్న చోటికి సిబ్బందిని సర్దుబాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

భూముల ధర పెంపుపై ఈ సందర్భంగా సీఎం అధికారులకు పలు సూచనలు చేసినట్టు సమాచారం. హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భూములు, స్థిరాస్తుల ధరలు భారీగా పెరిగినా, అదే స్థాయిలో రెవెన్యూ ఆదాయం ఎందుకు పెరగడం లేదని అధికారులను ఆయన ప్రశ్నించారు.

Tags

Next Story