TS : ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగారామసహాయం రఘురామ్ రెడ్డి.. ఎవరీయన?

TS : ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగారామసహాయం రఘురామ్ రెడ్డి.. ఎవరీయన?

ఖమ్మం లోక్ సభ అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించింది. రామసహాయం రఘురామ్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ ఎంపికచేసింది. ఈయన రాముడి గుడులు కట్టిస్తూ.. కొన్నేళ్లుగా ప్రజాసేవలో ఉన్నారు. రామసహాయం రఘురాంరెడ్డి కుటుంబం అనేక చోట్ల రామాలయం, శివాలయం, వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించింది.

డిసెంబర్ 19, 1961న హైదరాబాద్‌లో రామసహాయం సురేందర్ రెడ్డి, జయమాల దంపతులకు జన్మించిన రామసహాయం రఘురాంరెడ్డి హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో బీకామ్ విద్యను పూర్తి చేసి ఆ తర్వాత విద్యలో పీజీ డిప్లొమా చదివారు. వాస్తవానికి పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం చేగొమ్మకు చెందిన ఆయన తండ్రి రామసహాయం సురేందర్ రెడ్డి ఖమ్మంలో పుట్టి పెరిగారు. రామసహాయం సురేందర్‌రెడ్డి సీనియర్ కాంగ్రెస్‌ నేతల్లో ఒకరు. డోర్నకల్ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాలుగుసార్లు వరంగల్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన 1985 నుండి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు.

సురేందర్ రెడ్డి కుటుంబం దివంగత ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావుతో సన్నిహితంగా ఉండేది. కూసుమంచి మండలంలోని జీళ్లచెర్వు, చేగొమ్మ, ముత్యాలగూడెం గ్రామాలతోపాటు ఖమ్మం మండలం మద్దులపల్లి గ్రామానికి సురేందర్ రెడ్డి పోలీసు పటేల్‌గా పనిచేశాడు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2012లో రాజ్యసభకు, 2014లో ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. అయితే చివరి నిమిషంలో మరొకరిని ఎంపిక చేశారు. రఘురామ్ రెడ్డి 2011-2013లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)కి గార్డియన్ గా పనిచేశాడు. ప్రస్తుతం, అతను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ వైస్ ఛైర్మన్‌గా, హైదరాబాద్ రేస్ క్లబ్ బోర్డు సభ్యునిగా పనిచేస్తున్నాడు. రఘురాంరెడ్డితో పాటు ఆయన తాతలు సేవకార్యక్రమాలు నిర్వహించారు. మార్కెట్ యార్డు, పోలీస్ స్టేషన్, తహసీల్దార్, ఎంపీడీఓ, ఆర్టీసీ బస్టాండ్, పీహెచ్‌సీలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు, టీటీడీ కల్యాణ మండపాలు, వరంగల్‌లో రెడ్డి మహిళా వసతి గృహాలు, రామాలయం, శివాలయం, వేంకటేశ్వర స్వామి ఆలయాలు చాలా చోట్ల నిర్మించారు.

Tags

Read MoreRead Less
Next Story