TS : కాంగ్రెస్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్:కేటీఆర్ ట్వీట్

TS : కాంగ్రెస్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్:కేటీఆర్ ట్వీట్
X

కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ నేతలను ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పారు. ‘కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదు.. రైతు వ్యతిరేక పాలన. ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసం. ప్రతీ గింజకు బోనస్ అని.. ఇప్పుడు సన్న వడ్లకే అంటారా? రైతుభరోసా, రుణమాఫీ ఏమయ్యాయి? నమ్మి ఓట్లేసిన ప్రజల గొంతు కోస్తున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

వరిపంటకు 500 బోనస్ అని ప్రకటించి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతారా అని ప్రశ్నించారు. ప్రచారంలో ప్రతి గింజకు అని ఊదరగొట్టి ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా అని సీరియస్ అయ్యారు. ఇది ప్రజాపాలన కాదని రైతు వ్యతిరేక పాలన అని దుయ్యబట్టారు. నిన్నటిదాకా సాగు నీరు ఇవ్వక సావగొట్టారని.. కరెంట్ కోతలతో పంటను ఎండగొట్టారని.. కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాల పాలు చేసి ఆగం చేశారని మండిపడ్డారు. ప్రతి ఏటా రైతుల, కౌలు రైతులకు రూ.15 వేలు రైతు భరోసా అని హామీ ఇచ్చి ఇవ్వలేదన్నారు. వ్యవసాయ కూలీలకు రూ.12వేలు రైతు భరోసా అన్నారు ఇవ్వలేదని తెలిపారు.

ప్రతి రైతుకు డిసెంబర్ 9నే రెండు లక్షల రుణమాఫీ అని చేయలేదని, నేడు బోనస్ విషయంలో కూడా ప్రభుత్వ బోగస్ విధానాన్ని బయటపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల నాడు ఒకమాట.. నాట్లనాడు మరో మాట చెప్పడమే కాంగ్రెస్ నైజమని.. అసెంబ్లీ ఎన్నికల్లో గాలి మాటలతో కాంగ్రెస్ గారడీ చేసిందని కేటీఆర్ సీరియస్ అయ్యారు.

Tags

Next Story