TG : దర్గా సమీపంలో కూర్చున్న వారిపైకి దూసుకెళ్లిన డీసీఎం

X
By - Manikanta |21 Dec 2024 5:00 PM IST
నల్లగొండ జిల్లా దేవరకొండలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని ఓ దర్గా సమీపంలో రోడ్డుపక్కన కూర్చున్న వారిపైకి డీసీఎం దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. డీసీఎం అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో..ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు దేవరకొండ మండలం ఎర్రారం తాటికల్ వాసులుగా గుర్తించారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com