Kavitha Bail Petition : కవిత బెయిల్ పిటిషన్లపై తీర్పు రిజర్వ్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో ఈడీ, సీబీఐల వాదనలు ముగిశాయి. అనంతరం తీర్పును న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ రిజర్వ్ చేశారు. కవితకు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని.. మహిళ అయినంత మాత్రాన ఆమెకు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని దర్యాప్తు సంస్థలు కోర్టుకు వివరించాయి. ఈ నెల 30 లేదా 31న తీర్పు వెలువడే అవకాశం ఉంది.
సాక్షులను బెదిరించడంతోపాటు, సాక్ష్యాలను చెరిపేసే ప్రయత్నంచేశారని, అందువల్ల ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ, సీబీఐ తరఫు న్యాయవాదులు దిల్లీ హైకోర్టుకు విన్నవించారు. ఈడీ సమన్లు జారీచేసిన రెండురోజుల్లోనే ఆమె నాలుగు ఫోన్లను ఫార్మాట్ చేసినట్లు చెప్పారు. ఆమె సాధారణ గృహిణికాదని, ఒక రాష్ట్రానికి సీఎంగా చేసిన వ్యక్తి కుమార్తె అని పేర్కొన్నారు. అన్నీ తెలిసి తప్పు చేసిన వారికి బెయిల్ ఇవ్వరాదని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com