ED Raids : బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు

ED Raids : బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు

పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ( Mahipal Reddy ), ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో ఈడీ తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్‌లోని మూడు చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈడీ అధికారులు ఏక కాలంలో గురువారం తెల్లవారుజాము నుంచే మహిపాల్‌ రెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టారు. అలాగే, ఆయన సోదరుడు గూడెం మధుసూదన్‌ రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఈడీ సోదాల విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇద్దరు సోదరులు మైనింగ్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో ఓ కేసులో గూడెం మధు అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే.

అక్రమ మైనింగ్ పైన ఇప్పటికే మధుసూదన్ రెడ్డి తోపాటు మైపాల్ రెడ్డి పై కేసు నమోదైన విషయం తెలిసిందే.. గతంలోని సంగారెడ్డి కలెక్టర్ అక్రమ మైనింగ్ లపై విచారణ కొనసాగుతుంది. ఆర్డిఓ నేతృత్వంలో జరిగిన విచారణలో అక్రమ మైనింగ్ గుర్తించారు. లగ్డారంలో నమోదైన కేసు ఆధారంగా సోదాలు చేస్తున్న ఈడీ అధికారులు వెల్లడించారు. పెద్ద ఎత్తున బినామీల పేర్లతోటి ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. బినామీ పేర్లతోటి మైనింగ్ వ్యాపారాలు చేస్తున్నట్టు గుర్తింపు. రియల్ ఎస్టేట్స్ వ్యాపారంలో బినామీ పేర్లతోటి పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

Tags

Next Story