Phone Tapping Case : రాధాకిషన్‌‌ రావుకు ఎస్కార్ట్ బెయిల్‌‌

Phone Tapping Case : రాధాకిషన్‌‌ రావుకు ఎస్కార్ట్ బెయిల్‌‌
X

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు, సిటీ టాస్క్‌‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు ఎస్కార్ట్ బెయిల్‌‌ మంజూరు చేసింది. తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు అనుమతించింది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు రాధాకిషన్ రావును జైలు ఎస్కార్ట్‌‌ సిబ్బంది చంచల్‌‌గూడ నుంచి ఆయన తల్లి అంత్యక్రియలు జరిగే గ్రామానికి తీసుకెళ్లారు.

రాధాకిషన్‌‌రావుకు మాతృ వియోగం

రాధాకిషన్ రావు తల్లి పొట్లపల్లి సరోజిని దేవి(98) ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఆయన జైలుకు వెళ్లినప్పటి నుంచి ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియల కోసం ఆమె డెడ్ బాడీని సొంత ఊరైన జనగామ జిల్లా చిల్పూరు మండలం పల్లగుట్టకు తరలించారు.

Tags

Next Story