KCR : బీఆర్ఎస్తోనే రైతురాజ్యం సాధ్యం : కేసీఆర్

అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని తెలంగాణను సకలం బాగుచేసుకుంటూ వచ్చిన కేసీఆర్ పాలన పోతదనుకోలేదని, జరిగిన పొరపాటుకు తెలంగాణ సమాజం బాధపడుతున్నదంటూ కేసీఆర్ ( KCR ) vg కలిసిన కార్యకర్తలు ఆవేదనను వెల్లడించారు. BRS అధినేత కేసీఆర్ ను కలవడానికి పలు ప్రాంతాల నుండి వచ్చిన కార్యకర్తలు అభి మానులు అభిప్రాయపడ్డారు. తిరిగి కేసీఆర్ ముఖమంత్రి కావాలని వారంతా ఆకాంక్షించారు. ప్రతిరోజూలాగే గురు వారం కూడా ఎర్రవెల్లి నివాసానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
ఖమ్మం, మహబూబా బాద్, వేములవాడ, నర్సాపూర్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల నుండి తనను కలిసేందుకు వచ్చిన వారితో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే దేశానికి ఆదర్శ పాలనను అందించిందన్నారు. విద్యుత్ సాగు, తాగు నీరు తదితర రంగాల్లో నాటి బీఆర్ఎస్ ప్రభు త్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యాచరణ దేశ చరిత్రలోనే మున్నెన్నడూ లేనివిధంగా కొనసాగిందన్నారు. తెలంగాణ వ్యవసాయ ప్రగతిని చూసి మహారాష్ట్ర వంటి పక్క రాష్ట్రాల ప్రజలు తమకూ కేసీఆర్ పాలన కావాలని కోరుకున్నారని తెలిపారు.
"అబ్ కీ బార్ కిసాన్ సర్కార్" అనే నినాదంతో దేశంలో రైతురాజ్యం తెచ్చుకోవాలని బీఆర్ఎస్ తో కలిసి అడుగులేస్తూ ముందుకు కదిలిన మహారాష్ట్ర, తదితర రాష్ట్రాల ప్రజలు మొన్నటి తెలంగాణ ఎన్నికల ఫలితాలతో తీవ్ర ఆవేదన చెం దారని తెలిపారు. కేసీఆర్ పాలన లేకపోవడం వల్ల తెలంగాణ రైతుల కంటె మహారాష్ట్రతో పాటు దేశ రైతాంగమే తీవ్రంగా నష్టపోయిందని ఇటీవల తనను కలిసిన మహారాష్ట్ర నేతలు అన్నట్లు వెల్లడించారు. అయినా ఏమాత్రం అధైర్యపడొద్దని కార్యకర్తలకు కేసీఆర్ భరోసా ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com