TS : ఐదు రోజులు తెలంగాణలో వర్షాలు

తెలంగాణకు ఐదురోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీఅయింది. రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ అంచనా వేసింది. మే 26 వరకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. మే 22న కుమురం భీమ్ మినహా అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
తెలంగాణలో రేపు ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీమ్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ఐఎండీ తెలిపింది. మే 24న కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మంలో వర్షం కురిసే అవకాశం ఉంది.
శనివారం నాడు కామారెడ్డి, మెదక్, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్కర్నూల్లో.. ఆదివారం సంగారెడ్డి, మెదక్, మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్, కొత్తగూడెం, ఖమ్మంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే చాన్సుంది. జూన్ ఫస్ట్ వారాంతం నుంచి విస్తారమైన వర్షాలు రుతుపవనాల ప్రభావంతో కురుస్తాయని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com