TG : మల్లారెడ్డే లేటు!.. 15మంది పీర్జాదిగూడ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లోకి జంప్

TG : మల్లారెడ్డే లేటు!.. 15మంది పీర్జాదిగూడ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లోకి జంప్

మాజీ మంత్రి మల్లా రెడ్డికి సొంత పార్టీ నేతలు పెద్ద షాక్ ఇచ్చారు. తన నియోజకవర్గం పరిధిలోని ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొ రేషన్లో 15 మంది బీఆరెస్ కార్పొరేటర్లు పార్టీకి గుడ్ బై కొట్టి కాంగ్రెస్ లోకి వెళ్లారు. తాజా పరిణామంతో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ బలం మరింత పెరిగింది.

త్వరలోనే పీర్జాదిగూడ కార్పొరేషన్ హస్తగతం కానుంది. కాంగ్రెస్ లో చేరిన 15 మంది కార్పొరేటర్లతో డిప్యూటీ మేయర్ శివకుమార్ ఆధ్వర్యంలో గోవాలో క్యాంప్ రాజకీయం నడుపుతున్నారు. మొన్న రాజేంద్రనగర్ కార్పొరేషన్, జవహర్ నగర్, నిన్న బోడుప్పల్ కాంగ్రెస్ కైసవం అయ్యాయి. అదే బాటలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కూడా హస్తగతం కానుంది. మరోవైపు పార్టీ మారుతున్న కార్పొరేటర్లను మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి నిలువరించలేక పోయారు. వారిని అడ్డుకోలేక చేతులెత్తేశారు. ఈ వ్యవహారంలోనే మంగళవారం జరిగిన పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్ లో రసాభాస చోటు చేసుకుంది.

తమ పార్టీకి చెందిన కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని.. బలవంతంగా బెదిరింపులకు పాల్పడి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారంటూ టీఆరెస్ నేతలు ఆరోపించారు. అయితే మల్లారెడ్డినే కాంగ్రెస్ లో చేరబోతున్నారని, బీఆరెస్ కార్పోరేటర్లు కాంగ్రెస్ లోకి పంపించారన్న ప్రచారం కూడా బలంగా కొనసాగుతోంది.

Tags

Next Story