TG : మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి కన్నుమూత

TG : మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి కన్నుమూత
X

సిద్దిపేట జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే డి. రామచంద్రారెడ్డి(85) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి చనిపోయారు. మాజీ సీఎం కేసీఆర్ సమకాలికులైన ఈయన 1985లో దొమ్మాట నియోజకవర్గం(ప్రస్తుతం దుబ్బాక) నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. రామచంద్రారెడ్డికి ఇద్దరు కుమార్తెలు ఉండగా, వారి వద్దే ఉంటున్నారు. స్వస్థలం సిద్దిపేట జిల్లా కొండపాక. అప్పట్లో సిద్దిపేట నుంచి కేసీఆర్‌.. దొమ్మాట నుంచి రామచంద్రారెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. ఆయన మృతి పట్ల మాజీ మంత్రి హరీశ్‌రావు సంతాపం తెలిపారు. ఆయన సేవలు నేటితరం రాజకీయ నాయకులకు స్ఫూర్తి అని కొనియాడారు. ఎమ్మెల్యే అయినా తన తుదిశ్వాస వరకు సాధారణ జీవితాన్ని గడిపారని, ప్రజాసేవకు పరితపించారని, తన సేవలు నియోజకవర్గ ప్రజల్లో చిరస్థాయిగా నిలుస్తాయన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Tags

Next Story