TS : హైదరాబాద్ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్

TS : హైదరాబాద్ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్

హైదరాబాద్ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. నేషనల్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 కేంద్రాల్లో భారత్ రైస్ విక్రయాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 10 కిలోల బ్యాగులు అందిస్తున్నట్లుగా వెల్లడించారు. కిలో భారత్ రైస్ రూ.29కాగా.. 10 కిలోల బ్యాగుకు రూ.290 చెల్లించాల్సి ఉంది.

హైదరాబాద్ నగరంలో కిలో రూ.29 భారత్ రైస్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఏపీ రైస్ స్టోర్ మెట్టుగూడ, చంద్రమౌళి ట్రేడర్స్ కార్వాన్, ధనలక్ష్మి ఎంటర్ ప్రైజెస్ SR నగర్, డింగ్ డాంగ్ సూపర్ మార్కెట్, కాప్రా గౌతమ్ రైస్ డిపో, లంగర్ హౌజ్ జై తుల్జా భవాని ఏజెన్సీ, ఆర్కేపురం మాణిక్య ట్రేడర్స్, మురళి కిరాణా అండ్ జనరల్ స్టోర్ పటాన్ చేరు, ముత్తయ్య గ్రాండ్ బజార్ శేర్లింగంపల్లి, కైసర్ కిరాణా అండ్ జనరల్ స్టోర్ హైదరాబాద్ లో పొందవచ్చు.

సిర్వి ట్రేడర్స్ బోడుప్పల్, శంకర్ ట్రేడింగ్ కంపెనీ సికింద్రాబాద్, శ్రీగోవింద ట్రేడర్స్ కాచిగూడ, శ్రీవీరభద్ర ట్రేడర్స్ కవాడిగూడ, శ్రీఅంబా ట్రేడర్స్ హైదరాబాద్, శ్రీబాలాజీ రైస్ డిపో రాంనగర్, శ్రీసాయిబాబా రైస్ డిపో కార్వాన్, శివ సాయి రైస్ ట్రేడర్స్ కర్మాన్ ఘాట్, శ్రీసాయి ట్రేడర్స్ కొత్తపేట, శ్రీ ట్రేడర్స్ చందానగర్, ఉజ్వల్ ట్రేడర్స్ మల్లేపల్లి, ఉప్పు రాజయ్య ట్రేడర్స్ షాపూర్ నగర్, రిలయన్స్ దేవరయంజాల.

Tags

Read MoreRead Less
Next Story