Gold : తులం బంగారం వారంలో ఇచ్చేయాలి.. హరీశ్ అల్టిమేటం
కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఎటాకింగ్ గేమ్ చేస్తూనే ఉంది. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అంతేకాదు.. 59 జీవో పట్టాల పంపిణీ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు.
పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక భరోసా కళ్యాణ లక్ష్మీ పథకం ఆనాడు కేసీఆర్ తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు హరీశ్ రావు. నాడు కేసీఆర్ కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు తీసుకొచ్చి పేద కుటుంబాలకు అండగా నిలబడ్డామని చెప్పారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థికంగా సాయం చేశామని చెప్పారు. అయితే.. తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కొత్తగా ఏమీ చేయకపోయినా పర్వాలేదు కానీ.. ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేర్చాల్సిందే అని మాజీమంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు.
59 జీవో కింద పట్టా తీసుకోబుతున్న వారు మీ ఆస్తికి మీరు హక్కు దారులని హరీశ్ రావు స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాడుతామని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు చెప్పారు. ఎన్నికల వేళ కాంగ్రెస్.. తమ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కల్యాణలక్ష్మి కింద లక్ష రూపాయలతో పాటుగా తులం బంగారం అందిస్తామని హామీ ఇచ్చిందని అన్నారు. మాట తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులతో పాటుగా తులం బంగారం ఇవ్వాలని హరీశ్రావు డిమాండ్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com