TS : అమిత్ షా వస్తున్న వేళ హరీశ్ రావు వాహనం తనిఖీ

TS : అమిత్ షా వస్తున్న వేళ హరీశ్ రావు వాహనం తనిఖీ

మెదక్ లోక్ సభ రాజకీయం ఆసక్తిగా మారింది. బీఆర్ఎస్ కు కచ్చితంగా వచ్చే సీటు అంటూ ప్రచారం జరుగుతున్నా ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ టఫ్ ఫైట్ ఇస్తున్నాయి. దీంతో.. మెదక్ మునుపెన్నడూ లేని రీతిలో ఆసక్తి రేపుతోంది. బీజేపీ నుంచి రఘునందన్ రావు బరిలో ఉండగా.. కాంగ్రెస్ నుంచి నీలం మధు.. రేవంత్ సపోర్ట్ తో మాస్ టచ్ ఇస్తున్నారు. మరోవైపు.. కేసీఆర్, హరీశ్ రావు బలంతో.. మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి మెదక్ బరిలో ఉన్నారు. క్యాండిడేట్ ను చూసినట్టయితే.. ఇక్కడ గతంలో లెక్కలు తారుమారయ్యే చాన్సుంది.

మరోవైపు గురువారం మెదక్ సెగ్మెంట్ పరిధిలోని సిద్దిపేట పట్టణంలో అమిత్ షా బహిరంగ సభలో పాల్గొననున్నారు. దీంతో.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేశారు పోలీసులు. అన్ని వాహనాలు తనిఖీ చేస్తున్నారు.

మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ నుండి మెదక్ వెళ్తున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వాహనాన్ని నర్సాపూర్ సమీపంలోని హైదరాబాద్ రోడ్‌లో ఉన్న మల్లన్న గుడి వద్ద ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ వద్ద ఎన్నికల అధికారులు, పోలీసులు తనిఖీ చేశారు. హరీష్ రావు అధికారులకు సహకరించి ఆ తర్వాత వెళ్లిపోయారు.

Tags

Read MoreRead Less
Next Story