Heavy Rains : ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ఆవర్తనం ప్రభావంతో.. ఉత్తర ఒడిశా తీరానికి దగ్గరలో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరశాఖ తెలిపింది. ప్రస్తుతం ఇది సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తులో ఏర్పడిందని పేర్కొంది. రాబోయే రెండురోజుల్లో వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. కొన్నిచోట్ల ఉపరితల గాలులు వీస్తాయని హెచ్చరించింది వాతావరణ కేంద్రం.
సోమవారం వరకు మలుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పలుచోట్ల బలమైన ఉపరితల గాలులు వీస్తాయని పేర్కొంది. జూలై 2 వరకు ఆదిలాబాద్, ఆసిఫ్రాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది.
గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కొత్తగూడెం, హన్మకొండ, ములుగు, వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో అత్యధికంగా 87 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com