Hussian Sagar : హుస్సేన్ సాగర్ ఫుల్.. దిగువ ప్రాంతాలు హైఅలర్ట్

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్ కు వరద భారీగా పోటెత్తుతుంది. సాగర్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ నీటి మట్టం చేరింది. హుస్సేన్ సాగర్ ప్రస్తుత 513.40 మీటర్ల నీటిమట్టం ఉంది. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్ల వరకు నీరు చేరింది. స్లూయిజ్ గేట్ ఓపెన్ చేసి మూసీలోకి అధికారులు నీటిని విడుదల చేశారు.
అలాగే తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి నీటిని మూసీలోకి అధికారులు వదులుతున్నారు. హుస్సేన్ సాగర్ నీటి మట్టాన్ని ఎప్పటి కప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. హుస్సేన్ సాగర్ ఇన్ 1850 క్యూసెక్కులు కాగా... ఔట్ ఫ్లో 1600 క్యూసెక్కులుగా ఉంది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. హుస్సేన్ సాగర్ వద్దనీటిమట్టాన్ని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత అధికారులు పరిశీలించారు. సాగర్ దిగువన ఉన్న కాలనీలోని ప్రజలను అప్రమతంగా ఉండా అంటూ హెచ్చరికలు జారీ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com