TS : MPగా పోటీ చేస్తున్న కేఏపాల్

TS : MPగా పోటీ చేస్తున్న కేఏపాల్

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) హాట్ కామెంట్ చేశారు. విశాఖ ఎంపీగా పోటీచేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు. మంచి అభ్యర్థులు ఉంటే ప్రజాశాంతి పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థులుగా ప్రకటిస్తానని చెప్పారు. ప్రభుత్వం కులగొట్టాలని కుట్రలు చేస్తే.. మరో ఉద్యమం జరుగుతుందన్నారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీకి వెళితే వాళ్ళపై కేసు వేస్తానన్నారు.

దేశం కోసం నేను పని చేస్తున్న తన మాటలను ప్రజల్లోకి తీసుకుపోకపోతే శాపం తగులుతుందన్నారు పాల్. త్రాగునిటీ సమస్య జిల్లాను ఇబ్బందులు పెడుతుంటే కోమటిరెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ ఈడీ పేరుతో బెదిరిస్తుందన్నారు. అవినీతి పరులు దేశంలో చాలా మంది ఉన్నారని తెలిపారు. బీజేపీ తెలంగాణలో భూ స్థాపితం అవుతుందన్నారు. మొదటి నుంచి తాను నిజాలు చెప్పినా మీడియా వినలేదన్నారు.

కేసీఆర్ పై తాను ఐదు కేసులు వేసి గెలిచానన్నారు కేఏపాల్ . కొత్త కట్టడాల పేరుతో ప్రజలకు నష్టం చేశారని తెలిపారు. కేసీఆర్ ను ప్రజలు ఓడించారన్నారు. తనను చంపడానికి, జైల్లో పెట్టడానికి కేసీఆర్ కుట్రలు చేశారని విమర్శించారు. డ్రగ్స్ తో యువత తప్పుదోవ పడుతుందని.. నాయకులు కూడా ఈ కేసులో ఉన్నారన్నారు. మంచి నీళ్లు ఇవ్వడం లేదు.. కరెంట్ కోతలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తన మాటలు గాలికి వదిలేయొద్దని..తాను వాస్తవాలు మాట్లాడుతున్నానని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story