Kavitha : కవిత బెయిల్ పిటిషన్ .. సీబీఐ ఛార్జ్షీట్లో తప్పులపై చర్చ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్, డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టింది. లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర, అందుకు సంబంధించిన సాక్ష్యాలతో కూడిన సప్లిమెంటరీ చార్జిషీట్ను దాఖలు చేసినట్టు సీబీఐ శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టుకు తెలిపింది. దాన్ని పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈ అంశంపై విచారణ చేపడతామని న్యాయమూర్తి కావేరి భవేజా తెలిపారు.
ఛార్జ్ షీట్ లో తప్పులు..
సీబీఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్ పై విచారణ జరిగింది. సీబీఐ ఛార్జ్ షీట్ లో తప్పులున్నాయని కవిత తరపు న్యాయవాది కోర్టుకు చెప్పారు. తప్పులు లేవని సీబీఐ తరపు న్యాయవాది అన్నారు. చార్జ్ షీట్లో తప్పులున్నాయని కోర్ట్ ఆర్డర్ ఫైల్ చేయాలని జడ్జి కావేరి భవేజా చెప్పారు. కోర్ట్ ఆర్డర్ అప్ లోడ్ కాలేదని కవిత తరపు న్యాయవాది అన్నారు. తదుపరి విచారణను జులై 22 కి రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. డిఫాల్ట్ బెయిల్, ఛార్జ్ షీట్ లో తప్పులపై విచారణ జరిగేంత వరకు చార్జ్ షీట్ను పరిగణనలోకి తీసుకునే అంశం పై విచారణ వాయిదా వేయాలని కవిత తరఫు న్యాయవాది చెప్పారు.
ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకునే అంశం కవిత డిఫాల్ట్ బెయిల్కి సంబంధం లేదని సీబీఐ తరపు న్యాయవాది వివరించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్లోని ఆమె నివాసంలోనే ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. కవిత తిహార్ జైలులో ఉండగానే ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసినట్టు ప్రకటించింది. ఆ తర్వాత కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ట్రయల్ కోర్టు తీర్పును కవిత హైకోర్టులో సవాల్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com