TS : నమ్మించి గొంతు కోసే రకం కేసీఆర్.. బండి సంజయ్ ఎటాక్

TS : నమ్మించి గొంతు కోసే రకం కేసీఆర్.. బండి సంజయ్ ఎటాక్

మళ్లీ డ్రామాలాడి ఓట్లు దండుకునేందుకు కేసీఆర్ కరీంనగర్ జనం ముందుకు వస్తున్నారని ఫైరయ్యారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్. కరీంనగర్ ప్రచారం నిర్వహించిన సంజయ్..10 ఏళ్లలో కేసీఆర్ చేసిన మోసాలను గుర్తు చేసుకోవాలన్నారు. సోషల్ మీడియా ద్వారా సోకాల్డ్ మేధావులతో కేసీఆర్ చేయిస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని హితవు పలికారు.

కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లించేందుకు, ఢిల్లీకి కప్పం కట్టేందుకు కాంగ్రెస్ డబ్బులిస్తోందని.. 6 గ్యారంటీలను అమలు చేసేందుకు మాత్రం డబ్బుల్లేవనడం సిగ్గు చేటు అన్నారు. రెండు పార్టీలను బొంద పెట్టాలని అన్నారు.

కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో వాకర్స్ ను కలిసి ఓట్లు అభ్యర్ధించారు బండి సంజయ్. తమ మద్దతు మీకేనంటూ... మోదీయే మళ్లీ ప్రధాని కావాలంటూ వాకర్స్ ఆయనకు చెప్పారు. కబ్జాలు చేసి వాళ్ల మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్ నిందితులంతా అరెస్ట్ కావడం తథ్యమనీ.. పొరపాటున ఎవరైనా పైసలు తీసుకుంటే...వారు కూడా ఇబ్బందుల్లో పడతారని సంజయ్ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story