TS : బీఆర్ఎస్ కు12 ఎంపీ సీట్లిస్తే కాంగ్రెస్ మెడలు వంచుతా: కేసీఆర్

TS : బీఆర్ఎస్ కు12 ఎంపీ సీట్లిస్తే కాంగ్రెస్ మెడలు వంచుతా: కేసీఆర్

బీఆర్ఎస్ కు 12 ఎంపీ సీట్లు ఇస్తే కాంగ్రెస్ సర్కారు మెడలు వంచి, హామీలు అమలయ్యేలా చేస్తానని కేసీఆర్ అన్నారు. నిన్న మిర్యాలగూడ, సూర్యాపేటలో రోడ్ షో నిర్వహించిన కేసీఆర్.. తెలంగాణకు మొదటి శత్రువు కాంగ్రెస్సేనని వ్యాఖ్యానించారు. తమ పదేళ్ల పాలనలో నాగార్జున సాగర్ ఆయకట్టుకు ఎలాంటి కొరత లేకుండా నీళ్లిచ్చామని, కాంగ్రెస్ దద్దమ్మలు ప్రాజెక్టును KRMBకి అప్పగించి, ఆయకట్టును ఎండబెట్టారని ఫైరయ్యారు.

బస్సు యాత్ర సందర్భంగా మిర్యాలగూడకు వెళ్తున్న కేసీఆర్‌ కాన్వాయ్‌లోని ఎనిమిది కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. వేములపల్లి మండలం బుగ్గబాయిగూడెం వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. కేసీఆర్‌ బస్సు వెనుక వెళ్తున్న ఒక కారు ఆకస్మాత్తుగా ఆగడంతో దాని వెనక వేగంగా, తక్కువ దూరంలో వెళ్తున్న కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఎవరికీ గాయాలు కాకపోవడంతో బీఆర్‌ఎస్‌ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. 5 నిమిషాల తర్వాత కాన్వాయ్‌ ముందుకు సాగింది.

సరైన ముహూర్తం.. పక్కా వాస్తును అనుసరిస్తూ.. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తన బస్సు యాత్రను ప్రారంభించారు. బుధవారం మధ్యాహ్నం సరిగ్గా 1.35 గంటలకు వాయువ్యం గేటు నుంచి తెలంగాణ భవన్‌కు వచ్చిన కేసీఆర్‌.. తిరిగి 1.38 గంటలకు ఆగ్నేయం గేటు నుంచి బయటకు వచ్చారు. 17 రోజుల పాటు 21 రోడ్డుషోల్లో కేసీఆర్‌ పాల్గొననున్నారు. గురువారం భువనగిరిలో పర్యటించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story