KCR : త్వరలోనే గజ్వేల్‌లో కేసీఆర్ భారీ సభ!

KCR : త్వరలోనే గజ్వేల్‌లో కేసీఆర్ భారీ సభ!
X

ఏడాది కాలంగా ఇంటికే పరిమితమైన మాజీ సీఎం కేసీఆర్ త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి రానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనా వైఫల్యాలపై గజ్వేల్‌లో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహణకు యోచిస్తున్నారు. అనువైన స్థలం కోసం పార్టీ శ్రేణులు వెతుకుతున్నట్లు సమాచారం. రైతు రుణ మాఫీ, రైతు భరోసా, నేతన్నలు, అన్నదాతలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీస్తారని తెలుస్తోంది.

తెలంగాణలో రాజకీయ వేడి మళ్లీ పెరగనుంది. గతంలో తన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకున్న కేసీఆర్, ఇప్పుడు కూడా అదే తీరులో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించనున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సభ తెలంగాణ రాజకీయాలలో కీలక మలుపుగా మారే అవకాశం ఉంది.

ప్రజల్లో తిరిగి తన ఆదరణ పెంచుకోవాలని చూస్తున్న కేసీఆర్, ఈ బహిరంగ సభ ద్వారా తన రాజకీయ శక్తిని ప్రదర్శించనున్నారు. దీని ద్వారా టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలకు కొత్త ఉత్సాహం రానుందని, ప్రభుత్వం పై ఒత్తిడి పెంచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Tags

Next Story