Harish Rao : ఏపీకి కేఆర్ఎంబీ దాసోహం: హరీశ్ రావు

కేఆర్ఎంబీ కళ్లు మూసుకుని ఏపీకి దాసోహమైందని మాజీ మంత్రి హరీశ్రవు ఆరోపించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ లేఖలు రాసి చేతులు దులి పేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కు అన్యాయం జరుగుతుంటే బనకచర్ల అంశంపై రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలు ఆ పార్టీకి పట్టవా? అని ఫైర్అయ్యారు. నీతి ఆయోగ్ సమావేశం లో బనకచర్ల అంశంపై ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. అపెక్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని ఎందుకు కోరడం లేదో చె ప్పాలన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో హరీశ్ మాట్లాడుతూ 'గాలీ మోటార్ పై తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతు న్నారు. ఒక్క డీఏ ఇచ్చేందుకు మూడు కమిటీలు వేశారు. దీనికి కేబినెట్ లో ఐదు గంటల చర్చ. ఉద్యోగులను నిట్ట నిలువునా ముంచుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన అబద్దమే. ఆయన రేవంత్ మించిపోతుండు. రాష్ట్రంలో క్రాప్ హాలీడే ప్రకటించి 65 టీఎంసీ నీటిని ఉపయోగించకుండా చేసిండ్రు. నీతి ఆయోగ్ మీటింగ్ లో రేవంత్ ప్రధానిని ఎందుకు ప్రశ్నించలేదు? చంద్రబాబును ఎదిరించే దమ్ము లేదా? సుప్రీంకోర్టుకు వెళ్లయినా సరే బనకచర్లను ఆపుతాం. తక్షణమే శ్రీశైలం కుడి కాల్వ లైనింగ్ పనులు నిలిపివేయాలి. కాళేశ్వరం కూలిందని కాంగ్రెస్ ప్రభుత్వం గోబెల్స్ ప్రచారం చేస్తుంది. మూసీలో గోదావరి నీళ్లు పోస్తా అంటవు, ఎట్ల సాధ్యమైతది రేవంత్ రెడ్డి? గంధమల్లకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో సీఎం చెప్పాలి' అని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com