TS : కవితకు మెడికల్ టెస్టుల తర్వాతే కేటీఆర్‌ ములాఖత్

TS : కవితకు మెడికల్ టెస్టుల తర్వాతే కేటీఆర్‌ ములాఖత్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ కస్టడీలో ఉన్నారు తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ కేసులో కవితను అరెస్ట్ చేసిన సీబీఐ.. శని, ఆదివారాల్లో కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. కేసులో సూత్రధారి కవితేనని ఇప్పటికే సీబీఐ అభియోగాలు నమోదుచేసింది.

కవితను సీబీఐ సెంట్రల్ ఆఫీస్‌కు తరలించిన అధికారులు.. స్కాం కేసులో ప్రశ్నలు సంధిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కవితను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

కవితతో ములాఖత్ అయ్యేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు. కేటీఆర్, కవిత భర్త, పీఏ భరత్, న్యాయవాది మోహిత్ రావులకు కూడా కోర్టు అవకాశం ఇచ్చింది. ఆదివారం సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య ఈ ములాఖత్ జరగనుంది. రెండు రోజుల పాటు కవితను ప్రశ్నించనుంది సీబీఐ. కస్టడీ ముగిసిన తర్వాత.. అంటే 48 గంటల తర్వాత కవితకు మెడికల్ టెస్ట్‌లు చేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story