KTR : టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన ఏఈఈ (సివిల్) పరీక్షకు 1180 పోస్టులకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక జాబితాను ప్రకటించటంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ). ఇప్పటి వరకు ఉద్యోగాలకు ఎన్నికైన వారి జాబితాను వెల్లడించకుండా ఆలస్యం చేస్తుందన్నారు. టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డితో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు.
దాదాపు 22 నెలల కిందే ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలై, ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా గతేడాది సెప్టెంబర్ నాటికే పూర్తైందని, అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు తుది జాబితాను విడుదల చేయటం లేదన్నారు. దీంతో అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే ఈ జాబితా ప్రకటించాలని కేటీఆర్ కోరారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com