TS : ఆర్మూర్ జీవన్ రెడ్డిపై భూకబ్జా కేసు

TS : ఆర్మూర్ జీవన్ రెడ్డిపై భూకబ్జా కేసు

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తన భూమిలో ఉన్న భవనాన్ని జీవన్ రెడ్డి కూల్చివేసి మరో భవనాన్ని నిర్మించారని సామ దామోదర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. బాధితుని ఫిర్యాదు జీవన్ రెడ్డితో పాటు మరో ఆయన కుటంబ సభ్యులలో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా ఈర్లపల్లి గ్రామంలో సర్వే నంబర్ 32, 35, 36, 38లో 20 ఎకరాల 20 గుంటల భూమిని సామ దామోదర్ రెడ్డి కొనుగోలు చేసి అతని తండ్రి పరమ్ రెడ్డి పేరుపై ఫంక్షన్ హాల్ నిర్మించారు. 2023లో జీవన్ రెడ్డి, అతని అనుచరులు ఫంక్షన్ హాల్ ను కూల్చేసి వేరే భవనాన్ని నిర్మించారని సామ దామోదర్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.

రెండు రోజుల క్రితం తమకి చెందిన భూమి దగ్గరికి వెళ్లగా మారణాయుధాలతో బెదిరించారని, తమ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని దామోదర్ కోరారు. దీంతో జీవన్ రెడ్డి, అతని భార్య రజిత, తల్లి రాజు భాయి, సురేష్ లపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Tags

Next Story