TS : భారీ కేడ్లు తొలగించిన మల్లారెడ్డి.. కుత్బుల్లాపూర్ లో ఉద్రిక్తత

TS : భారీ కేడ్లు తొలగించిన మల్లారెడ్డి.. కుత్బుల్లాపూర్ లో ఉద్రిక్తత

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొర్టు వివాదంలో ఉన్న స్థలం తమదే అంటూ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిలు తమ అనుచరులతో కలిసి అక్కడ వేసిన భారీ కెడ్లను తొలగించారు.ఈ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. స్థలంలో వేసిన భారీ కేడ్లను తొలగించేందుకు ప్రయత్నిస్తుండగా కొంతమంది అడ్డుపడ్డారు.

అయితే, అందులో 1.11 గుంటల భూమి తమదంటూ మరో 15 మంది మల్లారెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఒక్కొక్కరం 400 గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశామని చెప్తున్నారు. కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు. అయినా.. మల్లారెడ్డి తన అనుచరులతో బెదిరింపులకు గురి చేస్తున్నారని వాపోయారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులు ఇరువురికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.కోర్టు ఆర్డర్ ఉన్నందున సంఘటన స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరువర్గాలకు సర్ది చెప్తున్నారు పోలీసులు. ఎంఎల్ఎ మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఆయన అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Tags

Next Story