Amit Shah : ఈనెల 24న తెలంగాణకు అమిత్ షా

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) ఈనెల 24న తెలంగాణకు (Telangana) రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీ (BJP) చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొననున్నారు. ఈ విష యాన్ని పార్టీ నేతలు ప్రకటించారు. ఆయన రాకకు సంబంధించి బీజేపీ అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి దిశానిర్దేశం చేయనున్నారు.
గతేడాది డిసెంబర్ 28న తెలంగాణకు వచ్చిన అమిత్ షా .. తెలంగాణలో 10 ఎంపీ స్థానాలు గెలిచి 35 శాతం ఓట్లు సాధించాలని స్థానిక నాయకత్వానికి అమిత్ షా టార్గెట్ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల వేళ పార్టీ ముఖ్య నేతలంతా ఐక్యంగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. రాష్ట్రాన్ని 5 క్లస్టర్గా విభజించి బీజేపీ నేతలు రథయాత్రలో పాల్గొంటున్నారు.
తాజాగా ఈ రథయాత్రలో పాల్గొనేందుకు అమిత్ షా తెలంగాణలో పర్యటించబోతున్నారు. కేంద్రంలో మూడోసారి అధికారంలో వచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో తెలంగాణలో పది సీట్లు గెలవాలని తద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com