MLC Kavitha : పోలవరం ముంపుపై జాయింట్ సర్వే చేయాలి : ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha : పోలవరం ముంపుపై జాయింట్ సర్వే చేయాలి : ఎమ్మెల్సీ కవిత
X

పోలవరం ముంపుపై జాయింట్ సర్వే నిర్వహించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ముంపు నుంచి భద్రాచలం పట్టణాన్ని, శ్రీరాముడి గుడిని రక్షించాలన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై ఇవాళ ఆమె హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ నెల 25న ప్రధాని మోదీ అధ్యక్షతన పోలవరం ముంపు సమస్యలపై ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ , ఒడిశా రాష్ట్రాల సీఎంలతో భేటీలో భద్రాచలం సమస్యలకు పరిష్కారం చూపాలని సమావేశంలో తీర్మానం చేశారు. భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉన్న ఐదు గ్రామ పంచాయ తీలు యటపాక, పురుషోత్తపట్నం, గుండాల, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడులను తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టుపై జాగృతి ఆధ్వర్యంలో కోర్టుల్లో కేసులు వేశామన్న కవిత.. విభజన చట్టంలో 136 ముంపు గ్రామాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. 2014లో మోడీ ప్రధానమంత్రి కాగానే ఏడు మండలాల ను ఏపీకి ఇచ్చారని విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రంలో బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేశారని ఆరోపించారు. పురుషోత్తపట్నంలోని రాముల వారి భూములు ఆక్రమణకు గురికా కుండా ఏపీ ప్రభుత్వం చూడాలన్నారు.

Tags

Next Story