Rainfall in Telangana : నాలుగు రోజులపాటు మోస్తరు వర్షాలు

Rainfall in Telangana : నాలుగు రోజులపాటు మోస్తరు వర్షాలు
X

రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములు గు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

మంగళవారం నుంచి బుధవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, కరీం నగర్, వరంగ్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ఈ మే రకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్టు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాపాతం నమోదైంది. మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.

Tags

Next Story