TS : రేపు హైదరాబాద్ కు మోదీ... మల్కాజిగిరిలో రోడ్ షో

TS : రేపు హైదరాబాద్ కు మోదీ...  మల్కాజిగిరిలో రోడ్ షో

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) రేపు అంటే మార్చి 15వ తేదీన హైదరాబాద్ కు రానున్నారు. వాస్తవానికి మార్చి 16న తెలంగాణకు రావాల్సి ఉంది. అయితే దక్షిణాది రాష్ట్రాల ప్రధాని పర్యటనలో స్వల్ప మార్పులతో ప్రధాని పర్యటన షెడ్యూల్ ఖరారయింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మోదీ ఎన్నికల ప్రచారంలో స్వల్పమార్పులు చోటుచేసుకున్నాయని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

మొదట ఈనెల 16వతేదీన ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తారని బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి సమాచారం వచ్చినా...తాజాగా ఈనెల 15ననే ఆయన రాష్ట్రంలో పర్యటిస్తారని బీజేపీ శ్రేణులు తెలిపాయి. 15వ తేదీన హైదరాబాద్ కు వచ్చే ప్రధాని అదేరోజు మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో చేపట్టే రోడ్ షోలో పాల్గొననున్నారు.

16వ తేదీన నాగర్ కర్నూల్, 18న జగిత్యాలలో బీజేపీ ఎన్నికల బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొంటారు. ఈ నెల 15న మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలో సుమా రు గంటన్నరసే పు భారీ రోడ్ షో ఉంటుందని బీజేపీ నేతలు వివరించారు. ఈ నెల 15, 16 తేదీలతో పాటు 18న తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.

ఇప్పటికే ప్రధాని మోదీ ఈ నెల 4, 5 తేదీల్లో ఆదిలాబాద్, సంగారెడ్డి లో పర్యటించి ఎన్నికల ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ప్రధాని ఎన్నికల ప్రచారంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ వచ్చింది. తాజాగా మరో మారు మూడు రోజులపాటు ప్రధాని తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుం డడంపై బీజేపీ నేతలు, శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story