MLA Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్పై మళ్లీ కేసు నమోదు

ఎన్నికల రూల్స్ ఉల్లంఘన నేపథ్యంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో రాజాసింగ్ బిజెపి ఎంపీ అభ్యర్థి నగేష్ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. ఖానాపూర్ పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద ఆయన ప్రచారం నిర్వహించగా, ఎన్నికల నియమావళి ఉల్లంఘించి రాత్రివేళ సమయం దాటిపోయిన తన ప్రసంగాన్ని కొనసాగించారని పోలీసులకు ఫిర్యాదు అందింది.
ప్రచార సభలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించి ఎమ్మెల్యేలు రాజాసింగ్ పాయల్ శంకర్ ఎంపీ అభ్యర్థి జీ నగేష్ కార్యక్రమం నిర్వహించిన స్థానిక బిజెపి నేత మహేందర్ లపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన వ్యవహారంలో కేసు నమోదు చేసినట్లు ఖానాపూర్ పోలీసులు వెల్లడించారు.
వివాదాస్పద ఎమ్మెల్యేగా పేరున్న గోషామహల్ శాసనసభ్యులు రాజాసింగ్పై ఖానాపూర్ లో కేసు నమోదు కావడం చర్చకు దారితీసింది. దీనిపై ఎలాంటి వివరణ ఇస్తారన్నది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com