TG : రేవంత్ తెచ్చిన మార్పు ఏమీ లేదు.. రఘునందన్ ఫైర్

TG : రేవంత్ తెచ్చిన మార్పు ఏమీ లేదు.. రఘునందన్ ఫైర్

మార్పు రావాలని చెప్పి ఏం మార్పు తెచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ( Raghunandan Rao ) ప్రశ్నించారు. ముఖ్యంగా ప్రభుత్వ హాస్టళ్లు ఇంకా అధ్వాన్న పరిస్థితికి చేరుకున్నాయని ఫైర్ అయ్యారు. గవర్నమెంట్ హస్టళ్లలో జరుగుతున్న ఘటనలపై ట్విట్టర్ వేది కగా ఆయన బుధవారం స్పందించారు. జేఎన్ టీ యూ క్యాంటిన్ సాంబారులో ఎలుక!, మోడల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులకు అస్వస్థత అని పత్రికల్లో వచ్చిన కథనాలను పోస్ట్ చేశారు.

మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్నారు మొత్తానికి కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు కానీ ఏం మార్పు తెచ్చారని ప్రశ్నించారు. నాటి బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో దుస్థితి పురుగుల అన్నం, నీళ్ల చారు లా ఉండేదని, నేడు కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో ఇంకా అధ్వాన్న పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. వారం రోజులో నాలుగు సంఘ టనలు చోటు చేసుకున్నాయని, ఈ విషాహారం తిని బలి అవుతున్న విద్యార్థుల ప్రాణాలకు గ్యారెంటీ ఎవరని ప్రభుత్వాన్ని నిలదీశారు. అలాగే అస్తవ్యస్థంగా మారిన ప్రభుత్వ వ్యవస్థ వల్లే విద్యార్థులకు ఈ అవస్థ అని తెలిపారు.

ఇకనైనా కాంగ్రెస్ సర్కారు కళ్లు తెరవాలని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని రఘునందన్ రావు కోరారు.

Tags

Next Story