Road Accident : ప్రాణం తీసిన ఓవర్ స్పీడ్..

హెల్మెట్ లేకుండా ఓవర్ స్పీడ్ తో డ్రైవ్ చేస్తూ ఓ స్టూడెంట్ చనిపోయిన ఘటన కీసర పోలిస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా, కండూరు గ్రామానికి చెందిన రవీందర్రెడ్డి కర్ర అనే వ్యక్తి తన మూడో కొడుకు కరుణాకర్ రెడ్డి (22) మేడ్చల్ జిల్లాలోని షామిర్పేట్ బిట్స్ పిలానీలో బీ టెక్ థార్డ్ ఇయర్ చదువుతున్నాడు. అయితే సోమవారం రాత్రి 10 గంటల సమయంలో కరుణాకర్ రెడ్డి అతని ఫ్రెండ్ శ్రీషిత్తో కలిసి ఎఫ్ జెడ్ బైక్ మీద కీసర వైపు భయలు దేరారు. ఆ దారిలో వస్తుండగా యాద్గార్పల్లి సమీపంలోకి రాగానే స్పీడ్ గా రైడ్ చేయడంతొ కల్వర్ట్ ను ఢీ కొట్టాడు. దానితో కరుణాకర్ రెడ్డి స్పాట్ లోని చనిపోయాడు. అతని వెంబడి ఉన్న ఫ్రెండ్ శ్రీషిత్ స్వల్ప గాయాలతో భయట పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గాంధీ హాస్పిటల్ మార్చురి వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరు అయ్యారు. అనంతరం ప్రమాదంపై పోలీసులు విచారించాలని కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com