PM Modi : మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మోదీ

Secunderabad : సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బెంగుళూరు పేలుళ్ల నేపథ్యంలో మహంకాళి దేవాలయాన్ని ఎస్పిజి తమ ఆధీనంలోకి తీసుకుంది. భద్రత దృష్ట్యా బారికెడ్లతో ఆలయ పరిసర ప్రాంతాలను మూసేశారు. మహంకాళి ఆలయంలో పూజల అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి శేష వస్త్రంతోపాటు చిత్రపటాన్ని మోదీకి బహూకరించారు. అంతకుముందు అర్చకులు ప్రధానికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం ప్రధాని బేగంపేటకు బయల్దేరారు. బేగంపేట నుంచి సంగారెడ్డికి ప్రధాని వెళ్లనున్నారు. సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులను మోడీ ప్రారంభించనున్నారు. రూ.9,021 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను మోడీ చేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com