TS : మోడీ వస్తే ఇక ఎన్నికలు ఉండవు

కేంద్రంలో మళ్లీ బీజేపీ వస్తే.. దేశంలో ఇవే చివరి ఎన్నికలు అవుతాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డికి మద్దతుగా గురువారం ఖమ్మంలో నిర్వహించిన కార్మిక, వ్యాపారుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, బీజేపీని ఓడించడమే దీనికి పరిష్కార మార్గమన్నారు తమ్మినేని. కాంగ్రెస్ కు వామ పక్షాలు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతున్నాయని, ఖమ్మంలో అత్యధిక మెజారిటీ ఖాయమన్నారు. రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అరాచక పాలన కొనసాగిస్తున్న బీజేపీకి ఈ ఎన్నికల్లో ఓటర్లు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు.
పదేండ్లుగా పార్లమెంట్ నియోజకవర్గానికి బీఆర్ఎస్, బీజేపీలు ఏం చేయలేదని, ఈ సారి తనకు అవకాశ మివ్వాలని కోరారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డి. ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ వామపక్షాలతో కలిసి బీజేపీని నిలువ రిద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి, తుమ్మల యుగేందర్, బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com