TS : ట్యాపింగ్ ప్రభాకర్ రావు యాక్షన్ ప్లాన్ ఇదే

TS : ట్యాపింగ్ ప్రభాకర్ రావు యాక్షన్ ప్లాన్ ఇదే

తెలంగాణలో (Telangana) సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సోమవారం యూఎస్ నుంచి వస్తారని, కేసులో అప్రూవర్‌గా మారుతారని లీకులొచ్చాయి. అవన్నీ వట్టి పుకార్లేనని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. ఆయన మనసు మార్చుకున్నట్లుగా తెలుస్తోంది.

ప్రభాకర్ రావు కొంత మంది పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి అప్రూవర్ గా మారుతానని బయటపడేయాలని కోరినట్లుగా ప్రచారం జరిగింది. రాజకీయ బాసులు చెప్పినట్లే చేశానని చెప్పి.. మొత్తం వారిపై నెట్టేసి బయటపడాలనుకున్నారు. కానీ ఆయన హఠాత్తుగా ఆగిపోయారు. అప్రూవర్ కాకుండా ఉన్నత స్థాయిలో ఆయనపై ఒత్తిడి ఉన్నట్లుగా చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రభాకర్ రావు అమెరికాలోనే ఉన్నారు. క్యాన్సర్ చికిత్స అని చెబుతున్నారు కానీ.. పోలీసులు నమ్మడం లేదు. మరో మూడు నెలల పాటు అక్కడే ఉండాలని.. అప్పటి పరిస్థితుల్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. అదే విషయాన్ని రాష్ట్రంలోని పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేసినట్లుగా తెలుస్తోంది. ప్రభాకర్ రావు నివాసంలో పోలీసులు సోదాలు చేశారు. అయనను అదుపులోకి తీసుకుని విచారిస్తే గానీ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు.

Tags

Read MoreRead Less
Next Story