Wednesday Holiday : బుధవారం సెలవు.. రామ ర్యాలీకి రాజాసింగ్ నేతృత్వం

Wednesday Holiday : బుధవారం సెలవు.. రామ ర్యాలీకి రాజాసింగ్ నేతృత్వం
X

దేశమంతా మరోసారి రామనామంతో పులకించిపోనుంది. శ్రీరాముని జన్మదినమైన నవమి ఏప్రిల్ 17 బుధవారం రోజును తెలంగాణ ప్రభుత్వం సెలవు గా ప్రకటించింది. శ్రీరామ నవమిని హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించేందుకు బీజేపీ నాయకత్వం సిద్ధమైంది.

హైదరాబాద్‌లో రామ నవమి శోభా యాత్రకు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ నాయకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ధూల్‌పేట్ నుండి ప్రారంభమయ్యే శోభా యాత్రకు రాజా సింగ్ నాయకత్వం వహించనున్నారు. ఇటీవల ఆయన యాత్రకు సంబంధించి వాలంటీర్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శనివారం, తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా.. " ఏప్రిల్ 17, 2024న శ్రీరామ నవమికి ​​ధూల్‌పేటలోని ఆకాశపురి హనుమాన్ దేవాలయం నుండి ప్రారంభమయ్యే భారీ ఊరేగింపును విజయవంతం చేయడానికి ఒక స్వచ్ఛంద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని తమ భాగస్వామ్యం ద్వారా విజయవంతం చేయడానికి కట్టుబడి ఉన్న రామ్ భక్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు" అని ఆ పోస్ట్ లో రాజాసింగ్ తెలిపారు.

బుధవారం నమి సందర్భంగా రామాలయాలు, వైష్ణవాలయాలు ప్రత్యేకంగా ముస్తాబయ్యాయి. రథాల ఊరేగింపు చేసి రాముడి కల్యాణం, పట్టాభికాన్ని కన్నులపండువగా నిర్వహించనున్నారు. హైదరాబాద్ లో సెక్యూరిటీ టైట్ చేశారు.

Tags

Next Story