Farmers : వచ్చే వారం రైతులకు నష్ట పరిహారం!
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చేవారం నుంచి బాధితుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ సేకరించిన రైతుల వివరాల ఆధారంగా రూ.10వేల చొప్పున పరిహారం ఇవ్వనుంది. ఈసీ అనుమతితో ఫండ్స్ రిలీజ్కు ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చినట్లు సమాచారం.
గత ప్రభుత్వం రైతులకు నష్ట పరిహారం కింద ఎకరాకు రూ.10 వేలు ఇచ్చినప్పుడు విమర్శించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు అదే 10 వేలు ఇవ్వడానికి ముందుకొచ్చింది. రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగండ్ల వానల కారణంగా మార్చిలో 10 జిల్లాల్లో 15,812 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు వ్యవసాయశాఖ నిర్ధారించింది. నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com