TS : రైతులకు రేవంత్ గుడ్ న్యూస్
తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కొన్నినెలలుగా ఎదురుచూస్తున్న పంట పరిహారం పంపిణీకి నిర్ణయం తీసుకుంది. పరిహారం పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతించడంతో వచ్చే వారం రైతులకు పరిహారం ఇస్తామని ప్రకటించింది. రైతులకు పరిహారం కింద ఎకరాకు రూ.10 వేలు ఇవ్వనుంది.
అకాల వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 15,812 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఎకరాకు రూ. 10 వేల చొప్పన పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వానికి రూ. 15.81 కోట్లు అవసరమవుతాయి.
రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగండ్ల వానల కారణంగా మార్చిలో 10 జిల్లాల్లో 15,812 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు వ్యవసాయశాఖ నిర్ధారించింది. నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ప్రస్తుతం కోడ్ అమల్లో ఉన్న కారణంగా పంపిణీ చేయలేకపోతున్నామని, ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాగానే పంపిణీ చేస్తామని మంత్రులు చెప్పారు. ఈ మేరకు అనుమతి కోరుతూ ఈసీకి ప్రభుత్వం లేఖ రాయడంతో స్పందించిన ఈసీ పరిహారం పంపిణీకి అనుమతినిచ్చింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com