TS : రేవంత్ రెడ్డి సోయి లేకుండా మాట్లాడుతుండు.. కేసీఆర్ ఫైర్

TS : రేవంత్ రెడ్డి సోయి లేకుండా మాట్లాడుతుండు.. కేసీఆర్ ఫైర్

సీఎంస్థాయిలో ఉండి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సోయి లేకుండా మాట్లాడుతున్నాడని మాజీ సీఎం కేసీఆర్ (KCR) మండిపడ్దారు. తాము మాట్లాడితే రేపు ఈ సమయం వరకు తిడుతామన్నారు. ఉద్యమ సమయంలో మాట్లాడిన నేను.. అంతే తప్ప ఒక్కనాడు కూడా రేవంత్ రెడ్డి లాగా మాట్లాడలేదన్నారు. లంకె బిందెల కోసం వచ్చానని నేను ఏనాడైన అన్నమా? అని ప్రశ్నించారు. మాతో పోటీ పడేలా పాలన చెయ్. కానీ చేరుతాం.

బొంద పెడతాం అంటావా. అహోరాత్రులు కష్టపడి ఆలోచన చేసి 2014 నుంచి 19 వరకు ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చాను. మిషన్ భగీరథ నడిపే తెలివి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా?. రెప్ప పాటు కూడా కరెంట్ కూడా పోకుండా ఇచ్చాను. మేము అమలు చేసిన పథకాలు సక్కగా అమలు చేసే దమ్ము లేదా?. కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలి" అని కేసీఆర్ పిలుపునిచ్చారు.

కరోనా వచ్చి బాధ పెట్టినా, ఖజానాలో డబ్బు లేకున్నా రైతుబంధు ఇచ్చినా. ఈ చవట దద్దమ్మలు మాత్రం ఇవ్వలేకపోతున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత బలంగా గులాబీ జెండా ఎగిరితే అంత బలంగా మేము అభివృద్ధిపై పోరాడుతాం. చట్టం ప్రకారం జిల్లాకో నవోదయ ఇవ్వాల్సి ఉన్నా ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి?. ఐదు రూపాయల పని చేయని బండి సంజయ్ కు ఎందుకు ఓటెయ్యాలి?. బండి సంజయ్కి, వినోదికి మధ్య అసలు పోలిక ఉందా?.. అని మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story