TS : రిజర్వేషన్లపై అమిత్ షా వీడియో మార్ఫింగ్.. ఇరుకున పడ్డ రేవంత్ ఐటీ టీం!

కొద్దిరోజులుగా రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నట్టుగా ఓ వీడియో వైరల్ అవుతోంది. అది ఫేక్ అని ఇప్పటికే బీజేపీ వర్గాలు ఫ్యాక్ట్ చెక్ వీడియోలు బయటపెట్టాయి. ఐతే.. ఈ నేరానికి పాల్పడింది ఎవరు.. ఎన్నికల టైంలో తమను డీఫేమ్ చేస్తున్నదెవరు అనేదానిపై బీజేపీ గట్టిగా తవ్వుతోంది. దీంతో.. దీనివెనుక ఉన్నవారిపై కేసులు పెడుతోంది.
ఫేక్ వీడియోలపై దిల్లీ పోలీసులు ఆదివారం రోజున కేసు నమోదు చేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు విషయంలో త్వరలో దేశవ్యాప్తంగా అరెస్టులు ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. సదరు వీడియోలను షేర్ చేసిన వారిని అదుపులోకి తీసుకోవచ్చని అంటున్నారు.
ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్న ఇలాంటి వీడియోల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని ఫిర్యాదులో ఎంహెచ్ఏ తెలిపింది. వీడియోలను ఎక్కడి నుంచి షేర్ చేశారో తెలియజేసే కొన్ని లింకులను కూడా జత చేసినట్లు తెలిపింది. అమిత్ షా ఈ నెల 23న తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొని బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తామని తెలిపారు. ఈ వీడియోను మార్చి.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నట్టుగా ఎడిట్ చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ఐటీ వింగ్ కు నోటీసులు ఇచ్చే చాన్సుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com