TS : ఆర్ఎస్ ప్రవీణ్‌ డీజీపీ అయ్యేవాడు.. రేవంత్ హాట్ కామెంట్

TS : ఆర్ఎస్ ప్రవీణ్‌ డీజీపీ అయ్యేవాడు.. రేవంత్ హాట్ కామెంట్

మాదిగల హక్కుల కోసం బీఎస్పీ తరఫున పోరాడిన ఆర్ఎస్ ప్రవీణ్ ద్రోహం చేశారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. నాగర్ కర్నూల్ సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ప్రవీణ్ .. కేసీఆర్ గడీకి కాపలా కాస్తున్నారని ఫైరయ్యారు. ఐపీఎస్ కెరీర్ లో కొనసాగి ఉంటే ఆయన సీఎం కు సమాన హోదాలో డీజీపీ అయ్యేవారని అన్నారు. పాలమూరు బిడ్డ అని ప్రవీణ్ కు టీఎస్ పీఎస్సీ చైర్మన్ పదవి ఆఫర్ ఇస్తే కాదని.. దొరల పంచన చేరారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.

బీజేపీ నేతలు, డీకే అరుణమ్మతో తనకు పంచాయితీ ఏమీ లేదన్నారు రేవంత్. పాలమూరు నేతలంతా జిల్లాకోసం కలిసి పనిచేయడానికి ముందుకు రావాలన్నారు. ''అమ్మా తల్లీ.. డీకే అరుణమ్మ.. నేనేదో నిన్ను అవమానించానని అంటున్నావ్.. కానీ నీకు, నాకు మధ్య పోటీ ఏమిటి? గద్వాలలోనే ఓడిపోయిన నీకు, నాకు పోటీయా? బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉండి పాలమూరుకు ఏం చేశావో చెప్పాలి. కనీసం ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మేం చేసుకుందామని అనుకుంటే మోదీ చేతిలో మళ్లీ కత్తివై అడ్డుకునే ప్రయత్నాలు చేయడం ఏమిటి? మోదీ చేతిలో చురకత్తిలా ఎందుకు మారావో చెప్పాలి. నీ మీద నాకు అసూయ, కోపం, ద్వేషం లేవు. అమ్మా తల్లీ.. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని... నాకు ఈ జిల్లాలో శత్రువులెవరూ లేరు" అని సీఎం రేవంత్‌ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story